మెరుగైన పరిపాలన జనసేన, టిడిపితోనే సాధ్యం

  • నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: రాష్ట్ర ప్రజలకు మెరుగైన పరిపాలన కావాలంటే అది జనసేన టీడీపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి అన్నారు. మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఎంత అవసరమో వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం యంత్రాంగం తీరు కూడా బాగోలేదని అన్నారు. ఇంత అరాచకమైన ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేయకూడదని అన్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై వేయాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల్ సీనియర్ నాయకులు కరుమజ్జి గోవింద్, ఆల్తి రామచంద్ర, ఆల్తి శ్రీను, బద్రి, తాతబాబు, వేణు, బాలాజీ, సుగుణ మారుతి నాయుడు రెల్లి సత్యనారాయణ, చందక సాయి, కోంచడా నాయుడు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.