నిరుపేద కుటుంబాలకు బాసటగా బెటర్ లైఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్

రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 7 గురు యువకులు బెటర్ లైఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించారు వీరికి పుట్టినరోజు, పెళ్లిరోజు ఇంకా ఇతర శుభకార్యముల సందర్బంగా పేదవారికి సహాయం నిమిత్తం వీరి ట్రస్ట్ కి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. అలా వచ్చిన అమౌంట్ ఎవరైనా నిరుపేద కుటుంబంలో ఉండి వైద్యం కోసం ఇబ్బంది పడే వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటరు. ఇప్పటి వరకు 65మందికి ఈ సంస్థ నుండి 650,000 వరకు సహాయం చెయ్యడం జరిగింది. ఈ సంస్థలో సభ్యులుగా జనసైనికులు ముత్యాల జగదీష్, సాగిరెడ్డి గణేశ్, ఆచంట పండు, రేఖపల్లి బాబీ, ఆచంట రమేష్, అరేటి కృష్ణ, ఆచంట ప్రతాప్ ఉన్నారు.