ద్వారంపూడి తస్మాత్ జాగ్రత్త..!: మాకినీడి శేషు కుమారి

పిఠాపురం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసే అంత స్థాయి నీది కాదు. నువ్వు అవినీతికి పాల్పడిన పదివేల కోట్లు పైబడి ఉంటే తానే పవన్ కళ్యాణ్ కొనుండే వాడినని అంటున్న ద్వారంపూడి పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రజల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని కొనగలిగే దమ్ము ధైర్యం సొమ్ము కలిగిన నాయకుడు దేశంలోనే ఎవరైనా ఉన్నారా అని పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్డ్ మాకినీడి శేషుకుమారి సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వారాహి వాహనంపై వీరవిహారం చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి లెక్కలు తేల్చగానే కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా విలువిల్లాడిపోయి. తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియని దుస్థితిలో ద్వారంపూడి ప్రెస్ మీట్ పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మీ దౌర్జన్యాలు ఇక సాగబోవని, మరొకసారి స్థాయికి మించి మాట్లాడితే ఎమ్మెల్యే ద్వారంపూడికి కాకినాడ ప్రజలు జనసైనికులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే మాకు శిరోధార్యం అన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల మరొక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ద్వారంపూడి తస్మాత్ జాగ్రత్త జననేన అని లెక్కలు మాత్రమే తేల్చారు. జనసైనికులు కాకినాడ నియోజకవర్గ ప్రజలతో మమేకమై నీ బొక్కలు విరుస్తారని ఘాటుగా హెచ్చరించారు.