రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేసిన ఎంపీపీ సత్యవాణి రాము

గ్రామాలను అభివృద్ది పదాన నడిపిస్తున్న మలికిపురం మండల జనసేన పార్టీ మహిళా ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము మరియు బట్టేలంక మహిళా ఎంపీటీసీ శ్రీమతి శివజ్యోతి సుబ్రమణ్యం.

మలికిపురం మండలం, బట్టేలంక గ్రామంలో జనసేన పార్టీ చెందిన ఇరువురు వీర మహిళలు ఎంపీపీ, ఎంపీటీసీ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేయడం జరిగింది, ఈ సందర్బంగా మలికిపురం ఎంపీపీ శ్రీమతి సత్యవాణి రాము మాట్లాడుతూ రైతులకు సంబందించి వివిధ అంశాల మీద అవగాహన కలించడం కోసం రైతు భరోసా కేంద్రం ఉపయోగించుకోవాలని అన్నారు, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వంతో పని చేయించడం ప్రజా ప్రతినిధుల కనీస బాధ్యత మరియు హక్కు అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బట్టేలంక ఎంపీటీసీ శ్రీమతి శివజ్యోతీ సుబ్రమణ్యం మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు బట్టేలంక సర్పంచ్ బోనం సీతామహాలక్ష్మీ, కత్తిమండ సర్పంచ్ ఆరేటి రంగనాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.