వరద బాధితులకు అండగా నిలిచిన భూపాలపల్లి జనసేన
భూపాలపల్లి నియోజకవర్గం, మోరంచపల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన గ్రామస్థులకు జనసేన పార్టీ తరుపున నిత్యావసర సరకులు ఇచ్చి వారికి అండగా నిలవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆకుల శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు చారీ, మహిపాల్, ప్రవీణ్, అరవింద్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-21.44.41-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-21.44.40-1024x768.jpeg)