ముంజేరు గ్రామంలో వైఎస్ఆర్సిపికి బిగ్ షాక్

  • శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, ముంజేరు పంచాయితీలో అవినీతి, అరాచక పాలన చేస్తూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ 2019 వైసిపి పార్టీ గెలుపు కోసం కష్టపడిన నేతలను, కార్యకర్తల సేవలను విస్మరించి, అడ్డగోలుగా వ్యవహరిస్తూ, అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు వ్యవహార శైలికు విసుగు చెంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన అదే సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై. శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ముంజేరు గ్రామ వైసీపీకి చెందిన 150 కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ లోకం మాధవి జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.