ప్రత్తిపాడు జనసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ప్రత్తిపాడు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమయ్యబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసైనికులు ఏలేశ్వరం మండలంలో బైక్ ర్యాలీ చేప్పట్టారు, ర్యాలీ మార్గ మధ్యంలో గ్రామాల్లో ఆగుతూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను జనాలకి వివరించి, యర్రవరం గ్రామంలో నిరుపేదలకు జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ ఆర్థిక సహాయంతో అంబేద్కర్ కాలనీలో కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, యూత్ కి వాలీబాల్ కిట్టుని అందజేయటం జరిగింది. అలాగే పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తికి ప్రభుత్వం నుండే వచ్చే సహాయం అందని పరిస్థితుల్లో 5000 రూపాయలను సహాయంగా అందించారు. తిరుమాలి గ్రామంలో జనసేన నాయకులు కాసు బ్రహ్మానందం ఆర్థిక సహాయంతో ఒక కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. జనసేన పార్టీకి ఓటేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతీ గ్రామంలో ప్రజల్ని జనసైనికులు కోరటం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు తనయుడు నియోజకవర్గ జనసేన యూత్ నాయకులు వరుపుల సాయికిరణ్, ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షులు పలివెల వెంకట్రావు, తిరుమాలి జనసేన నాయకులు కాసు బ్రహ్మానందం, సిరిపురం జనసేన నాయకులు అచ్చె గోవింద్, నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యర్రవరం జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, మండల సెక్రటరీ యర్రంశెట్టి దుర్గాప్రసాద్ నాయుడు, ఏలూరు జనసేన నాయకులు శివ, ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-13.49.32-1024x769.jpeg)