జనసేన ఆద్వర్యంలో వరదబాధితులకు బిర్యానీ పంపిణి

పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, ఏనుగువాని లంక గ్రామంలో గ్రామ సర్పంచ్ ఈదా ప్రమీల మరియు వార్డు మెంబర్లు వలియా బేగం మరియు జనసైనికుల ఆధ్వర్యంలో వరదబాధితులకు బిర్యానీ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వరదబాదితులకు సహాయ సహకారాలు అందించడానికి జనసైనికులు ముందుకు సాగుతున్నారని దానిలో భాగంగానే వివిధ ప్రాంతాలలో భోజన పేకెట్ల పంపిణీ ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వం వరదబాదితులను ప్రాంతాలను బట్టి, పార్టీలను బట్టి కాకుండా మానవత్వంతో స్పందించి అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నట్టే.. అందరిని సమాన దృష్టితో చూస్తూ పాలన సాగించాలని కోరారు. ఈ సందర్బంగా ఈదా సువర్ణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల గోడును పట్టించుకోవడం లేదని, ఇబ్బందులకు గురి చేస్తుందని ఇలాంటి ధోరణి మానుకోవాలని హేచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏనుగువానిలంక గ్రామ అధ్యక్షులు ఇనుకొండ రమేష్, పెనుమదం ఎంపీటీసీ మానేపల్లి శ్రీడర్, పోడూరు మండల అధ్యక్షులు పీతాని వెంకి, వీరమహిళలు రియా మైగాపుల పద్మజ, జనసైనికులు చవాకుల సురేష్, ఇనుకొండ సాయి,
కొసన్నపూడి సాయి, వేమన సునీల్, ఇనుకొండ రవి, భావిశెట్టి మల్లి, తాడి సతీష్, బావుశెట్టి చంటి, వినకొండ వంశీ, భావిశెట్టి గంగాదర్, ఇనుకొండ నాగరాజు, ఇనుకొండ దుర్గా ప్రసాద్, పిప్పల్ల మణికంఠ, కూసంపూడి సాయి, సిద్దిరెడ్డి మణికంఠ, సిద్దిరెడ్డి దుర్గాప్రసాద్, వేమన నవీన్, సిద్దిరెడ్డి రాజేష్, పిప్పల్ల హనుమ, సిద్ఫిరెడ్డి రాంబాబు, ఇంటి శివ, ఇంటి ప్రసాద్, ఇంటి నాగబాబు,జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.