గుంటూరులో పంచాయతీ నిధుల మల్లింపులను నిరసిస్తూ బిజెపి, జనసేనల నిరసన

గుంటూరు: కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇస్తున్న డబ్బుల్ని వైసిపి ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ సర్పంచులకు మద్దతుగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గురువారం గుంటూరులో జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ పాల్గొని మిత్ర పక్షం బీజేపీ వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నగర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.