బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి: సనత్ కుమార్

తెలంగాణ, భూపాలపల్లి, టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలలో జనసేన జిల్లా అధ్యక్షులు జనసేన నాయకులను పరామర్శించుకుంటూ, చేనేత కార్మికుల కష్టాలను ఒక బిజెపి ప్రభుత్వం మాత్రమే తీరుస్తుందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని ఇక్కడ కూడా ప్రజలు ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని చేనేత కార్మికులను బిజెపికి ఓట్లు వేయాల్సిందిగా కోరారు, కీర్తి రెడ్డిని గెలిపిస్తే టేకుమట్లను అభివృద్ధి చేస్తారని చెప్పిన గత నాయకులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లారని చందుపట్ల కీర్తి అలా పార్టీ మారే వ్యక్తి కాదు అని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇవ్వలేదని, గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే బిజెపితో మాత్రమే సాధ్యమని తెలియజేశారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి తో మాత్రమే సాధ్యమని ఇప్పటికైనా ప్రజలు ఒక ఆలోచన చేసి బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ బిజెపికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టేక్ మట్ల మండలం నాయకులు నిమ్మల ప్రవీణ్, గణపురం మండలం నాయకులు పైడిమల రాజు, మరియు ప్రేమ్ కుమార్ రాజు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.