భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో పుంజుకున్న బీజేపీ.. 48 కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిస్తే అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటానని బండి సంజయ్ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు నేడు ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ సహా.. జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగాణంలో జైశ్రీరామ్ నినాదాలు చేశారు. కాగా, బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.