బీజేపీ అబద్ధాల పునాదుల పై ఎదగాలనుకుంటుంది: హరీష్ రావు

మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈరోజు పఠాన్ చెరులో జీ హెచ్ఎంసీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుందని, బీజేపీ వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలని అన్నారు. ఎవ్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి, కానీ ఆ పార్టీలు ఏం చేశాయని ఓట్లు వేయాలి ? అని ప్రశ్నించారు.

బీజేపీ కరోనా తో కూడా రాజకీయాలు చేస్తోందని. బీహార్ ఎన్నికలలో గెలవడానికి అక్కడి ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేసిందని గుర్తుచేశారు. మరి తెలంగాణకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా.. ? హైదరాబాదు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరా.. ? అని ప్రశ్నించారు. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెర్వు కు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీజేపీది దిగజారుడు రాజకీయమన్న ఆయన కాంగ్రెస్ ఏం చేసింది.. ? బీజేపీ ఎం చేసింది. ? అనే విషయాలు , తెరాస గెలిచాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస కార్యకర్తలు గడప, గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.