సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పిచికారీ చేసిన రాపాక రమేష్ బాబు

చింతలమోరి పంచాయితీ పరిధిలో అన్ని ప్రాంతాలలో వర్షాల కారణంగా నీరు నిలిచి ఆపరిశుభ్రంగా మారి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామం మొత్తం బ్లీచింగ్ జల్లే కార్యక్రమం బుధవారం సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు ప్రారంభించిచారు.
గ్రామంలో పంచాయతీ సిబ్బంది ఏ విధంగా బ్లీచింగ్ జల్లాలో గ్రామ సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు స్వయంగా తానే బ్లీచింగ్ జల్లి చూపించి.. దోమల పట్ల, విష జ్వరాల పట్ల ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఓగురి మనోహర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాపాక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.