పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకోవడం హేయమైన చర్య

  • ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజాదరణ చూసి వైఎస్ఆర్సిపి కుట్రలు చేస్తుంది.
  • అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
  • వికేంద్రీకరణ గర్జన విఫలమైంది.
  • పోలీసులు వైసీపీకి అనుకూలంగా కాదు చట్టానికి అనుగుణంగా పని చేయాలి

విజయవాడ, జనసేన పార్టీ విజయవాడ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అక్రమంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేశారని, తక్షణమే వారిని విడుదల చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి మరియు ఇతర కార్యక్రమాలకు పోలీసులు వెంటనే అనుమతి మంజూరు చేయాలని, డిమాండ్ చేస్తూ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మహేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి వైసిపి నాయకులకు కుట్రలు చేస్తున్నారని, వికేంద్రీకరణ గర్జన విఫలమైందని దానికి నైరాస్యం చెంది వైఎస్ఆర్సిపి నాయకులు కుట్రతో ఎయిర్ పోర్ట్ లో గందరగోళం సృష్టించారని, నిజంగా వేలాదిమంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సిపి మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలపై దాడులు చేస్తే వారు విమానం ఎక్కి విజయవాడ వచ్చి ప్రెస్మీట్ పెట్టేవారా అని ? విశాఖ సిటీ సీపి శ్రీకాంత్ నిర్లక్ష్య వైఖరి వల్లే శనివారం ఎయిర్ పోర్ట్ లో అలజడి జరిగిందని, అందుకు వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని, వైఎస్ఆర్సిపి మంత్రులు రోజా జోగి రమేష్ జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, సంఘటన గడిచి ఇన్ని గంటలు గడుస్తున్నా విశాఖ సిపి ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేయలేకపోయారంటే అసలు అక్కడ ఘటనే జరగలేదని, కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద అక్కసుతోనే ఇటువంటి అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యం అమలు కావడంలేదని జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన మాత్రమే సాగుతుందని ఇటువంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసునని, అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో పోలీసులు జనసేన పార్టీ నాయకులపై కుట్రలు చేశారని పవన్ కళ్యాణ్ కి అడుగడుగున అడ్డు తగిలారని ఎటువంటి కుట్రలో కుయుక్తులు చూస్తూ ఊరుకోమని వెంటనే జనవాణిని నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి వైఎస్ఆర్సిపి నాయకులకు కుట్రలు చేస్తున్నారని ఇటువంటి ఆపకపోతే తప్పక తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విజయవాడ నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం మాట్లాడుతూ వైయస్సార్సీపి నాయకులకు మతిభ్రమించిందని పవన్ కళ్యాణ్ కి విశాఖపట్నంలో ఆదరణ చూసి అవాక్కై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ని డిబేట్ కి రమ్మనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే డిబేట్ కి వస్తారా అని సవాల్ విసిరారు. జోగి రమేష్ కి దమ్ముంటే విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ తో డిబేట్ చేయాలని సవాల్ విసిరారు. కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ ప్రకృతి కూడా రాజధాని వికేంద్రీకరణపై ఇష్టంలేకనే భారీ వర్షం కురిసిందని శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కి ప్రకృతి అనుకూలించబట్టే లక్షలాది మంది జనం పవన్ కళ్యాణ్ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని, విశాఖపట్నంలో అలజడులు సృష్టించడం దుర్మార్గమని ఇకనైనా వైఎస్ఆర్సిపి నాయకులు తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో వీర మహిళలు తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 7 వ డివిజన్ అధ్యక్షులు దోమకొండ మేరీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే రద్దు చేసుకొని వారిని బేషరతుగా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోమని ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, నగర ప్రధాన కార్యదర్శులు మొబీన, లింగం శివప్రసాద్, కార్యదర్శులు కొరగంజి వెంకటరమణ, బోట్ట సాయి కుమార, శనివారపు శివ, పోలాసి దుర్గారాణి, గుండు రాము, పాల రజిని, డివిజన్ అధ్యక్షులు సిగనం శెట్టి రాము, పొట్నూరి శ్రీనివాస్ రావు, కూరాకుల సురేష్, నల్లబెల్లి కనకారావు, వేంపల్లి గౌరీ, బొమ్ము రాంబాబు, శంకర్, పుప్పాల శ్రీనివాస్, బాధిక శంకర్, దాసరి నాగరాజు, పోతిరెడ్డి వెంకటరమణ, విట్ల హరిప్రసాద్, వేముల వెంకటేష్, అల్లిబిల్లి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్, ఆకారపు విజయ్ కుమారి, ఎస్. నరేష్, టి.మురళీకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.