జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అంబేద్కర్, కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో స్థానిక ముస్లీం షాధిఖానాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ శిబిరంలో జనసైనికులు ఉత్సాహంగా పాల్గొని సుమారు రెండు వందల యూనిట్లు రక్తం స్థానిక ఏరియా హాస్పటల్, బుద్దా బ్లడ్ బ్యాంకులకు అందించడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ రాజబాబు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్స్ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా నాయకులు సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవిహారిక స్వామి, గొలకోటి విజయలక్ష్మీ వాసు, ఎంపీటిసిలు నాగులపల్లి శేషవేణి, తాళ్ళ లక్ష్మీ నరసాయమ్మ రవి, దోనిపాటి బాలమ్మ, మోటూరి కనకదుర్గ, కూనవరం సర్పంచ్ వాకపల్లి ఈశ్వరి సత్యనారాయణ, వార్డుసభ్యులు, సీనియర్ నాయకులు సూదా చిన్న, మోకా బాలయోగి, ఆకుల బుజ్జి, మంచిగంటి మాచరరావు, ఆకుల సూర్యనారాయణమూర్తి, కుంపట్ల రమేష్, గుమ్మళ్ళ తాతయ్య కాపు, సత్తి శ్రీనివాస్, ముత్తాబత్తుల శ్రీను, లంకే వెంకట్రావు, తూము రమేష్, గొర్తి పవన్, పొణకల ప్రకాష్, ఆకుల సర్వేష్, కూనంశెట్టి రాజేష్, పెమ్మిరెడ్డి నాగబాబు, షరీఫ్, షఫీ, కరీముల్లా బాబా, వీర మహిళలు చిక్కం సుధా సూర్యమోహన్, ముత్యాల మణమ్మ, చాట్ల మంగతాయారు, గనిశెట్టి లలిత, మోసుగంటి మల్లిక, త్సవటపల్లి పుష్ప, గోళ్ళ కమల, నల్లా వరలక్ష్మీ మరియు జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నా సేన కోసం నావంతులో భాగంగా క్రౌడ్ ఫండింగ్ కు అమలాపురం పురపాలక కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవిహారిక, గోలకోటి విజయలక్ష్మి చేపట్టారు. కౌన్సిలర్లు ఒక్కొకరు రూ500 వంతున ఫోన్ పే చేసారు. షా ధీ ఖానాలో జరిగిన రక్తదాన శిబిరంలో ఈ కార్యక్రమం చేపట్టారు.