రాజాం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో ఎన్ని రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసి జనసేన పార్టీ తరపున జరిగే ఏ సేవాకార్యక్రమాలైన ముందుండి నడిపించే జనసైనికులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-19.17.36-1024x1024.jpeg)