జీవనదానానికి రక్తదానం

*అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన జనసేన నేత బొర్రా వెంకట అప్పారావు

అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలోని రమ్య గ్రౌండ్స్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసుదేవరావు నిర్వహించిన రక్తదాన శిబిరం మరియు మొక్కల పంపిణీ కార్యక్రమంలో జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు 25వసారి రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేయొచ్చని ఆయన తెలిపారు. అలాగే వాసుదేవరావు వర్షాకాలాన్ని పురస్కరించుకుని మొక్కల పంపిణీ చేయడం పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment