గిరిజన కుటుంబాలకు సహాయమందించిన బొబ్బేపల్లి సురేష్ బాబు

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలో ఆదివారం ఆర్ ఆర్ కాలనీకి అనుకొని నివసిస్తున్న 10 గిరిజన కుటుంబాలకు బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇక్కడ నివసించే వారికి కనీసం రేషన్ కార్డు గానీ, ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అట్టడుగు వర్గాలలో ఉన్న గిరిజనులకు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు.. ఆ ప్రకటనలు పేపర్ల వరకూ మాత్రమే పరిమితమవుతున్నాయి. అకాల వర్షాలు వస్తే కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి వీరిది. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్పి డప్పు కొట్టుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో అభివృధ్ధి ఎక్కడ చేస్తున్నారు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందే పరిస్థితి లేనే లేదు. అమ్మ ఒడి ఎవరికి వెళ్తుంది, కొత్తగా ఇచ్చే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి పేద గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని జనసేన పార్టీ తరఫున సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం సునీత గారు, రహీం భాయ్, వీరబాబు, నాగరాజు, మల్లి, పవన్, రెహమాన్, రవికుమార్, సందీప్, శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.