అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం, గోవిందరాజుపురం గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గమైన సర్వేపల్లి నియోజకవర్గంలో నాడు నేడు పథకానికి సంబంధించిన నిధులు ఎటుపోతున్నాయి. ఎందుకని గోవిందరాజుపురంలోని అంగన్ వాడీ కేంద్రం చుట్టుపక్కల కంపచెట్లు, ముళ్లపోదలతో నిండిపోయి ఉంటే, నాడు నేడు పధకం కింద పారిశుద్ధ్య పనులు చేయించి శుభ్రం చేయాల్సిన బాధ్యత మీపై లేదా అన్ని మేం ప్రశ్నిస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు అంగన్ వాడి స్కూల్ కి వెళ్లి అక్కడ ఆడుకునే పరిస్థితి లేకుండా చేశారు. చిన్నపిల్లలు తిరిగే ప్రదేశం ఇంత దారుణంగా ఉంటే ఎందుకని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పట్టించుకోవడం లేదు. మరి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి కనిపించలేదా. లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లలేదా. సర్వేపల్లి నియోజకవర్గంలో మేము అన్ని ఏకగ్రీవమని చెప్పుకుంటున్నారు. మరి ఏకగ్రీవమైనప్పుడు ఎందుకని అభివృద్ధి చేయలేదు. నాడు నేడు పథకానికి సంబంధించి రూ.కోట్ల రూపాయల నిధులు ఎవరు దోచుకొని దాచుకుంటున్నారు. నాడు నేడు పథకం నిధులు ఎవరి ఖజానాలోకి వెళ్తున్నాయి. 20 రోజుల లోపల అంగన్ వాడీ కేంద్రం పరిసర ప్రాంతమంతాట ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు క్లిన్ చేసి శుభ్రపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో 20 రోజుల తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో తామే క్లీన్ చేసి అభివృద్ధి చేస్తాం. మీకు రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపించారని, కానీ మీరు మాత్రం ప్రతినిత్యం పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తూ, కాకమ్మ కథలు చెబుతున్నారే తప్ప పల్లెల్ని అభివృద్ధి చేయడం లేదు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమంపై, గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో, సుధాకర్ సుబ్రమణ్యం, రహీం భాయ్, అక్బర్, చిన్న, శ్రీహరి, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.