చెరుకూరు గ్రామంలో స్మశానాన్ని పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: తోటపల్లిగూడూరు మండలం, చిన్న చెరుకూరు గ్రామంలో ఉన్న స్మశానాన్ని గురువారం జనసేన పార్టీ నాయకులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా
బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఇప్పటివరకు సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం సరైన స్మశానాలు లేకపోవడం, కొన్ని చోట్ల స్మశానాలకు వెళ్లేందుకు దారులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్న చెరుకూరు గ్రామం నెల్లూరు నగరానికి ఆనుకొని ఉన్న స్మశానానికి కనీసం స్థలం కూడా లేకపోవడం దారుణం. బారెడ స్థలంలో ఒక శవం మీది ఇంకొక శవం పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇటీవల రెండు ఎకరాల స్థలాన్ని చెరువులో కేటాయించామని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ కేటాయించిన స్థలానికి సంబంధించిన రోడ్డు పూర్తిస్థాయిలో త్వరితగతిన నిర్మించి పూర్తి చేసి ఇవ్వాలి. మీరు అలా చేయలని పక్షంలో స్మశానం నిర్మించి ఇచ్చేంతవరకు జనసేన పోరాడుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సందీప్, రహీం, శ్రీహరి, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.