స్వామి వివేకానందకు నివాళులర్పించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఒక దేశ సంపద అంటే నదులు కాదు, ఖనిజాలు కాదు, దట్టమైన అడవులు కాదు, కలల ఖనిజాలతో కూడిన యువత రాబోయే రోజుల్లో యువతే దేశ భవిష్యత్తు అని గుర్తించిన మహా మేధావి ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా 1863లో జనవరి 12న నరేంద్రనాథ్ దత్త సాంఘిక సంస్కరణ తత్వశాస్త్రంలో దిట్ట. విదేశీ పాలనలో మసకబారిన మన దేశ ఖ్యాతిని, హిందూత్వంను, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి స్వామి వివేకానందగా వెలుగులోకి వచ్చిన మన భారతీయుడు. ఆయనను గౌరవించడానికి ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఈతరం యువత జనసేన పార్టీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తు బాగుండాలంటే ఒక జనసేనతోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో రహీం భాయ్, శ్రీహరి, చిన్న, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.