రోడ్ల సమస్యలపై గళమెత్తిన బొబ్బిలి జనసేన

బొబ్బిలి నుండి తెర్లం వెళ్లే రహదారిలో కొన్ని చోట్ల రోద్లు గుంతలు మయంగా దారుణంగా వున్నాయి, ప్రతీ రోజూ ఇదే రోడ్డు మీదుగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నారు, వాహన దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నారు.. కానీ మరమ్మత్తులు చేయడానికి ముందుకు రారు… ఎందుకంటే పని చేసినా చేయకపోయినా.. ప్రభుత్వం ఉద్యోగులను మరియు ఆదికార పార్టీ నాయకులను ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరేం అనలేరు.. అంటే కేసులు పెడతారు కాబట్టి. కానీ! జనసేన పార్టీ ప్రజల పార్టీ.. ప్రజలకోసం ఆవిర్బవించిన పార్టీ.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు జనసేన పార్టీ బయపడదు… ఒక వారం రోజుల్లో బొబ్బిలి నుంచి తెర్లమ్ వెళ్లే దారిలో వున్న గుంతలకు మరమ్మత్తులు చేయకపోతే జనసేన పార్టీ తరపున భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించడం జరిగింది. బొబ్బిలి అర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజా కాలేజ్ రహదారి, పూలబాగ్, దాడితల్లి గుడి దగ్గర, మరియు గొల్లపల్లి, పిరిడి పెట్రోల్ బంకు నుంచి పినపింకీ గ్రామ వరకు కొన్ని చోట్ల భారీ గుంతలు వున్నాయి.. దయచేసి అధికారులు స్పందించి మరమ్మత్తులు వారంలో చేయండి…. లేదంటే జనసేన పార్టీ చేయవల్సిన పని చేస్తుందని జనసేన పార్టీ తరపున.. రవి మరడాన తెలియజేసారు.