జనసేనలో చేరిన బోలిముంత విజయలక్ష్మి

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలంలో, చదలవాడ గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న “బోలిముంత విజయలక్ష్మి” జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సోమవారం వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త ఉషా రాజేష్ అధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జాయిన్ అయ్యారు. ఆమెకి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. మా పార్టీలో వెన్నుముకలాగ పని చేస్తున్నది మా వీరమహిళలే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని, విజయలక్ష్మి గారు ఒక వాలంటీర్ గా పని చేస్తూ ఇలా మా పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని, ఈ విషయం తెలిస్తే ఉద్యోగం నుంచి తీసివేస్తారు అని తెలిసి కూడా ఆమె ఇలా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం ఆమె దైర్యానికి మెచ్చుకోవాలి.. ఇలానే ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీ చేస్తున అరాచకాలకు ఎదురు తిరిగి వారి అధికారాన్ని గద్దెదించాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఓగొలు రమేష్ బాబు, దాధి సీతారామయ్య, చావలి గ్రామ సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాస్ రావు, తిరుమల రావు, బోల్లిముంత అమర్ పాల్గొన్నారు.