ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మాదాసు దుర్గాదేవికి ఆర్ధిక సాయమందించిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జట్లపలెం గ్రామంలో కరోనా కారణంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మాదాసు దుర్గాదేవికి ప్రతిరోజూ ఆక్సిజన్ పెట్టవలసిన పరిస్థితిలో ఉండగా, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో 5 రోజులకు ఆక్సిజన్ ఖర్చు నిమిత్తం 10 వేల రూపాయలు సహాయం చేసిన తాడేపల్లి గూడెం జనసేన ఇంచార్జీ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్.