ఇఫ్తార్ విందులో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా గురువారం సాయంకాలం స్థానిక తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్ లో జరిగిన ఇఫ్తార్ విందులో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ ముస్లిం సోదరులతో నమాజులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నెల రోజులపాటు ఉపవాసాలు ప్రార్థనలు దానధర్మాలతో నియమనిష్ఠలతో జరుపుకుంటారని అన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకగా శ్రీనివాస్ అభివర్ణించారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మరియు తాడేపల్లిగూడెం ప్రాంత ముస్లింలకు సోదరులకు బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనియులు బొలిశెట్టి రాజేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-21.57.27-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-21.57.25-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-21.57.25-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-21.57.28-1024x768.jpeg)