సొంత ఖర్చులతో గోతులను పూడ్చిన బొలిశెట్టి
జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్ధిక సహాయంతో తాడేపల్లిగూడెం రెండవ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గోతులను పూడ్చడం జరిగింది. ఇక్కడ పైపులైను లీకేజి వర్షం వల్ల ఆరు నెలలుగా రోడ్డు దెబ్బతిని నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది గాయపడ్డారు. మున్సిపాలిటీ స్పందించకపోవడంతో జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత ఖర్చుతో జెసిబి ఏర్పాటు చేసి గోతులను పూడ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు, నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-6.09.42-PM-1024x485.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-6.09.43-PM-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-6.09.44-PM-1024x576.jpeg)