విజయోత్సవ ర్యాలీనీ తలపించిన బొలిశెట్టి ఎన్నికల ప్రచారం

  • ఐదవ వార్డ్ లో హోరెత్తిన బొలిశెట్టి ఎన్నికల ప్రచారం

తాడేపల్లిగూడెం: ఐదవ వార్డ్ లో ఘనంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీనీ మరిపించినటువంటి ర్యాలీని ఐదవ వార్డ్ లో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపి బొలిశెట్టి శ్రీనివాస్ ఆ వార్డులో ఉన్న సమస్యలపై ధ్వజమెత్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాలలో వీధిలైట్లు, మంచినీటి వ్యవస్థపై ఎటువంటి పరిష్కారం అభివృద్ధి దిశగా ఆలోచించలేదు అన్నారు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కౌన్సిలర్ గొరుల సూరిబాబు ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేశామన్నారు. అలానే రాష్ట్రంలోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా అవినీతి పరిపాలన జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ పై ఓటు వేసి నన్ను, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఐదో వార్డ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.