14 వ రోజు జనంలోకి జనసేన

నరసాపురం, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 14వ రోజు నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం, మొగల్తూరు పంచాయతీ కోట దగ్గర ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పిఎసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్. ఈ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అని ఆ గ్రామ ప్రజలు తెలిపారని నాయకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, దూది బాబు, ఉప్పులూరి రాంబాబు, మాదిరెడ్డి బాలాజీ, లక్కు బాబి, అయితం చిన్ని, దాసరి కృష్ణాజి, నల్లి నాగరాజు, అందే దొరబాబు, అందే కొండ, వాసర్ల ఆంజనేయులు, జంపా వాసు, పులపర్తి వీరబాబు, కొల్లాబత్తుల మహేష్, కొండేటి తాతాజీ, కటకంశెట్టి సాయి, కడలి త్రిమూర్తులు, గజ్జరపు ఫణి, వాటాల రామారావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.