జాతీయ జెండా ఎగురవేసిన బొమ్మిడి నాయకర్
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. అనంతరం నరసాపురం పట్టణంలో పలు వార్డులలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాయకర్ భారతదేశ ప్రఖ్యాతి గురించి చెప్తూ పలు స్వాతంత్ర్య సమర యోధుల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-19.16.37-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-20.29.02-1024x576.jpeg)