వంగవీటికి ఘన నివాళులు అర్పించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: స్వర్గియ వంగవీటి మోహనరంగా 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నరసాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, బడుగుబలహీనవర్గాలకు బాసటగా, అప్పటి పాలక ప్రభుత్వపు అణచివేతలపై అలుపెరుగని పోరాటం చేస్తూ, అంబేడ్కర్ – పెరియార్ ఆశయసాధనలో అసువులు బాసిన వారి ధీరత్వాన్ని గుర్తుచేసుకుంటూ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.