వంగవీటి రాధాకృష్ణని పరామర్శించిన బొమ్మిడి నాయకర్

విజయవాడ, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా సతీమణి రత్నకుమారి అనారోగ్యంతో ఉన్న కారణంగా వారిని మరియు వారి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.