మత్స్యకార ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొమ్మిడి నాయకర్
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మత్స్యకార ఆత్మీయ సమావేశంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార సమస్యలనుద్దేశించి నాయకర్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు సరైన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమలు జరగడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, సోదరులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-6.00.56-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-6.00.58-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-6.00.58-AM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-6.00.57-AM-1024x576.jpeg)