శ్రీ భద్రకాళి సమేత ఉత్కంఠ వీరభద్ర స్వామి దర్శించుకున్న బోనబోయిన, గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలంలోని కుంకలకుంట గ్రామంలో వినాయక స్వామి వారి దేవాలయం, శ్రీ వీరభద్రస్వామి వార్ల దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని, ఆ స్వామివారి దీవెనలు ఈ గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకి, యావత్ ఈ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు, అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏ ఆటంకం లేకుండా స్వామివారి ఆశీస్సులతో నిర్వహించిన కమిటీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి, సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వర, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, వల్లెం శ్రీనివాసరావు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాసరావు, కుంకలగుంట గ్రామ అధ్యక్షులు చేపూరి వెంకటేశ్వర్లు, బాదినిడు సుబ్బారావు, మద్దాలి సైదారావు, తాడువాయి పెద్దయ్య, జడ అనిల్, సిరిగిరి మణికంఠ, మాదల గ్రామ అధ్యక్షుడు తిరుమల శెట్టి గోపి, తోట నాగేశ్వరరావు, ప్రభు, జనసేన సుబ్బారావు, అంచుల వెంకీ, బత్తిని సుబ్బు, రామాంజనేయులు, హర్ష, వెంకటేష్ మరియు నకరికల్లు సత్తెనపల్లి ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీరమహిళలను పాల్గొనడం జరిగింది.