కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, నాగాలంక మండలంలోని నాగాయలంక పట్టణంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, నాగాయలంక మండల ఉపాధ్యక్షులు బోనం పాపారావు బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. పాపారావు గారు మొదటి నుండి పాపారావు గారి కుటుంబం జనసేన పార్టీకి అండగా ఉంటూ ఈ రోజున ఆయన లేరు అనే విషయం జీర్ణించుకోలేని విషయం, దాదాపుగా పాపారావు గారి కుమారుడు బోనం చిరుగోపి నాయుడు మొదటి నుండి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, 2014 నుండి వారి కుమారుడు జనసేన పార్టీ జెండా పట్టుకుని జనసేన పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాదు వెళ్లి స్థిరపడటం వల్ల, ఆ బాధ్యతను పెద్దలు, గౌరవనీయులు, మేమందరం బాబాయి అని పిలుచుకునే వ్యక్తి జనసేన పార్టీ నాగాలంక మండలానికి ఉపాధ్యక్షులుగా పదవి తీసుకుని పార్టీకి చనిపోయే వరకు పనిచేసిన వ్యక్తి. అవనిగడ్డ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు జనసేన పార్టీ వార్డు నెంబర్ గా నిలబడి ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల కొరకు నిరంతరం పనిచేసిన వ్యక్తి. పాపారావు గారి లాంటి వ్యక్తి పెద్దగా చదువు లేకపోయినప్పటికీ, వేదికలెక్కి మాట్లాడక పోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వారి కుమారుడు చూపించిన మార్గంలో జనసేన పార్టీకి కృషి చేసిన బాబాయిని ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన వంతు కృషి నాగాలంక మండలంలో చేసినటువంటి వ్యక్తి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిన తర్వాత డాక్టర్ గారికి చూపించకుంటాను అని చెప్పి మా అందరి మధ్య నుండి దూరం అవటం అనే విషయం కన్నీళ్లు తెప్పిస్తుంది. నీతి నిజాయితీ కలిగిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా చేసుకుని ముందుకు నడుస్తూ, 2024లో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి సహకారంతో జనసేన పార్టీ తరఫున గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి విజయం కోసం, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు బాల సౌరి గారి విజయం కోసం కృషిచేసి, పార్టీని గెలిపించడంలో నాగాయలంక మండలంలో జనసేన పార్టీ తరఫున రాత్రి పగలు పనిచేసే వ్యక్తిగా మా అందరి మనసుల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి పాపారావు గారు. నేటి యువతకి పాపారావు గారు జనసేన పార్టీకి చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన మరణ వార్త జనసేన పార్టీలో, అవనిగడ్డ నియోజకవర్గంలో వారి కుటుంబంలో విషాద సాయిలు మిగిల్చాయి. ఈరోజు ఉదయం బోనం పాపారావు గారి నివాసానికి వెళ్లి, ఏ పార్టీ కోసం అయితే పనిచేసి ప్రాణాలర్పించారో ఆ పార్టీ తరఫున, జనసేన జెండాని ఆయనపై కప్పి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అంతిమయాత్రలో నాగాయలంక జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు నడుమ సాగనంపడం జరిగింది. పార్టీ కోసం ఎనలేని కృషిచేసిన పాపారావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున సానుభూతి తెలియజేయడం జరిగింది. వారి కుమారుడు గోపి నాయుడుకు అండగా నిలిచి ధైర్యం చెప్పడం జరిగింది. నిజంగా పాపారావు గారి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అనేక పోరాటాలలో, అనేక ప్రజా సమస్యల్లో జనసేన పార్టీకి అండగా నిలిచి కృషిచేసిన ఆయన యొక్క ఆశయాలను తప్పకుండా మేమందరం పాటిస్తాం, జనసేన పార్టీ ఎప్పుడు పేద ప్రజల గుండెల్లో నిలిచే విధంగా పాటుపడతాం. జోహార్ జోహార్ శ్రీ బోనం పాపారావు గారు.
Share this content:
Post Comment