చిరంజీవి అన్నదాన సత్రంలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా చిరంజీవి అన్నదాన సత్రం అరవపాలెం వారు ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ఉలిశెట్టి లక్ష్మణ్ దంపతులను సన్మానించి భక్తులకు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు, బట్టేలంక ఎంపిటిసి సుబ్రహ్మణ్యం శివ జ్యోతి, మలికిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి వాసు, యెరుబండి చిన్ని, బోనం సాయి, బాబీ నాయుడు, విజయ్, కిషోర్, వీర మహిళలు జ్యోతి, సత్య, అంజన, యమున, శాంతి తదితరులు భోజనాలు వడ్డించడం జరిగింది.