పలు కుటుంబాలను పరామర్శించిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు, కేశవదాసుపాలెం గ్రామంలో వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్ రెస్ట్ తీసుకుంటున్న శిరిగినీడి నాగేష్ ని వారి స్వగృహంలో పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని వారికి అవసరం అయిన పిజీయో థెరపీ వైద్యులను ఏర్పాటు చేస్తామని జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు మరియు బొంతు రాజేశ్వరరావు భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం కేశవదాసుపాలెం గ్రామంలో తోట వెర్రియ్య కాశీ యత్రకు వెళ్ళి అక్కడే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్నిచ్చడం జరిగింది. కేశవదాసుపాలెం గ్రామంలో జనసేన నాయకులు మండ లక్ష్మణరావు (బుల్లియ్య) తల్లి కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సర్పంచ్ మేడిది సరోజ భరత్, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, రావూరి నాగు, యెనుముల తాతాజీ, గ్రామ శాఖ అధ్యక్షులు మండేలా బాబి నాయుడు, మండల కమిటీ సభ్యులు జిల్లెళ్ల నరసింహారావు (రక్షక్) చింతలమోరి గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, తోట సత్తిబాబు, చవ్వాకుల వెంకట్, యెనుముల ఏసు, మురాల కన్న, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.