సత్తెనపల్లిలో దూసుకుపోతున్న బొర్రా అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం గుండ్లపల్లి గ్రామ కమిటీ అలాగే గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గుండపల్లి గ్రామంలో చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై కేసులు పెట్టి, జనసైనికులని బెదిరించాలని ప్రభుత్వం వారు పోలీసులు పైకి ఒత్తిడి చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టిన వెనుక అడుగు వేసేది లేదని బొర్రా అప్పారావు తెలిపారు. అలాగే గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడిని గ్రామకమిటీ సభ్యులని శాలువాతో వారిని సన్మానించడం జరిగినది. కమిటీలో ఎన్నికైన వారందరూ పవన్ కళ్యాణ్ ఆదేశాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని రానున్న రోజుల్లో జనసేన పార్టీని స్థాపించే విధంగా పనిచేయాలని ఆదేశించారు. గుండ్లపల్లి గ్రామంలో పర్యటించిన బొర్రా వెంకట అప్పారావు గ్రామంలోని సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలను ప్రజలకు గుర్తు చేశారు. గుండ్లపల్లి గ్రామంలో ముస్లిం, వడ్డెర, బీసీ నాయకులు అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్, జిల్లా నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొనడం జరిగినది.