నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేసిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆదేశాల మేరకు నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మి శ్రీనివాస్ నూతన కమిటీని వేయడం జరిగినది. నకరికల్లు మండలంలో మండల యువజన నాయకునిగా బండి వర్ధన్ కుమార్ గారిని, నకరికల్లు మండలం ఎస్టి సెల్ అధ్యక్షునిగా బాణావత్ శ్రీను నాయక్, నకరికల్లు గ్రామ అధ్యక్షునిగా పరసా రామకృష్ణని, దేచవరం గ్రామ అధ్యక్షునిగా తమ్మిశెట్టి నాగ అంజి ని, గ్రామ ఉపాధ్యక్షులుగా చల్లా కోటేశ్వరరావు, బత్తుల నాగరాజునీ ఎన్నుకోవడం జరిగినది. వారికి సత్తెనపల్లి నియోజకవర్గ సమరయకర్త బొర్రా వెంకట అప్పారావు నియామక పత్రాలను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మీసెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి పట్టణ 7వార్డు కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ముపాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరీ పవన్ కుమార్, నకరికల్లు మండల యువజన అధ్యక్షులు బండి వర్ధన్, నకరికల్లు గ్రామ అధ్యక్షులు పరసా రామకృష్ణ, గుల్లపల్లి గ్రామ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, పానుగంటి రామకృష్ణ, ఉదయ్ భాస్కర్, మిరియాల జగన్, మీరావలి తదితర జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాలొన్నారు.