గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిలకు నివాళులు అర్పించిన బొర్రా

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సోమవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు నియోజకవర్గంలోని సత్తనపల్లి పట్టణంతో పాటు నకరికల్లు మండలంలోని మండల జనసేన పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి అలాగే నకరికల్లు గ్రామంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మిశ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, పానుగంటి రామకృష్ణ, పసుపులేటి పవన్ కుమార్, గాదె సాంబశివరావు, రామిశెట్టి శ్రీనివాస్, చిలకా పూర్ణ, సిసింద్రీ, చిలకా సత్యం, ఈ శివ, ఏసుబాబు, నాగరాజు , వీరమహిళ నామాల పుష్ప , జనసైనికులు పాల్గొన్నారు.