మారుమూల వాడలలో సైతం బొర్రా పర్యటన

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చీమలమర్రి గ్రామంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు. దళిత వాడల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని, స్థానిక గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు స్థానికులు మాట్లాడుతూ నడిచేందుకు దారి కూడా కనీసం సరిగా లేదని కరెంటు లేదని గుడిసెల్లో నివసిస్తున్నామని అని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేతినేని శ్రీనివాసరావు, షేక్ సుభాని, షేక్ వలి, షేక్ పెద్దవల్లి, షేక్ బుడగారి వలి, అలపర్తి గిరి, చల్లా నాగ ప్రసాద్, ద్రువాదుల శ్రీను, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలక పూర్ణ, కడియం అంకమ్మరావు, తోట తిలక్, మువ్వ రాము తదితర ప్రముఖులు పాల్గొన్నారు.