హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: హనుమాన్ జయంతి సందర్భంగా ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి వారిని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు కు గ్రామ పెద్దలు జనసైనికులు అందరూ కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, సీరిగిరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నల్లపనేని రత్తయ్య, రుద్రజడ లక్ష్మయ్య, కామర్తి వెంకటేశ్వర్లు, ఆలయకమిటీ సభ్యులు ముళ్ళమూరి వెంకయ్య, మద్దికుంట శివయ్య, రుద్రజడ బుల్లబ్బాయి, సిరిగిరి పెద్ద గోపాల్ రావు, గ్రామ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.