రామిశెట్టి శ్రీనుకు బొర్రా వెంకట అప్పారావు ఆర్థికసాయం

ఆదివారం నకరికల్లు మండలంలో జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చల్లగుండ్ల గ్రామంలో సీనియర్ నాయకులు అయిన సాగి కోటేశ్వరావుతో ఆత్మీయ సమావేశం జరిగింది. అనంతరం రామిశెట్టి శ్రీను అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఫ్యాక్చర్ అయినందువలన అతన్ని పరామర్శించి తన వంతు సహాయముగా 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాగి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి, ఉపాధ్యక్షులు షేక్ రఫీ, సహాయ కార్యదర్శి మురళి, రాజుపాలెం మండల అధ్యక్షులు నర్సయ్య, సత్తనపల్లి రూరల్ అధ్యక్షులు నాగేశ్వరావు, గాదె సాంబశివరావు, బాలాజీ, నవీన్, రమేష్, గాదె కోటేశ్వరరావు, జనసైనికులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత చాగల్లు గ్రామంలో గ్రామ కమిటీని కలిసి నేను మీకు అండగా ఉన్నాను అని అప్పారావు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో మరికొందరు సీనియర్ నాయకులు, పటాన్ సాన్ మస్తాన్, ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి, సహాయ కార్యదర్శి సతీకల ఏడుకొండలు, గ్రామ కమిటీ వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.