వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి బొర్రా వెంకట అప్పారావు విరాళం

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న వీరభద్రస్వామి గుడి నిర్మాణానికి సత్తెనపల్లి జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఒకలక్షఆరు వేల రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్,గ్రామ అధ్యక్షుడు మరియు ఆరవ వార్డు నెంబర్ చేపూరి వెంకటేశ్వర్లు, ఏడవ వార్డు మెంబర్ చేపూరి వెంకటేశ్వర్లు, మండల కమిటీ సెక్రటరీ పసుపులేటి మురళి, బాదినీడి సుబ్బారావు, గ్రామజనసైనికులు పాల్గొనడం జరిగింది.