జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన బొర్రా వెంకట అప్పారావు
సత్తెనపల్లి నియోజకవర్గం, కందులవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరుడికి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తిని జనసేన పార్టీ మండల కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, సహాయ కార్యదర్శి పసుపులేటి రమేష్ జనసేన పార్టీ నాయకులు అప్పారావు దృష్టికి తీసుకువచ్చారు. బొర్రా వెంకట అప్పారావు మనసు చలించి ఆ వ్యక్తిని హాస్పిటల్లో పరామర్శించి, ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అలాగే తమ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-19.25.58-1024x480.jpeg)