గంపల శ్రీను కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామ వాస్తవ్యులు గంపల శ్రీను పెద్ద ఖర్మ సందర్భంగా వారి చిత్ర పటానికి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగినది. వారితో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు వారి వెంట ఉన్నారు.