మాదల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొర్రా
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలోని బీసీ, ఎస్టీ కాలనీలో సోమవారం ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఎస్టి, బీసీ కాలనీలోని సమస్యలను తెలుసుకొని, రాబోయే ఎన్నికల్లో బలంగా ముందుకు వెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, గట్టు శ్రీదేవి, చిలకా పూర్ణ, కోట తిలక్, రాము, కోట శివ గోవిందు, కోట సుబ్బారావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-01-at-8.22.54-PM-1024x460.jpeg)