దర్శిలో నాయకులను కలుస్తున్న బొటుకు – జనసేన పార్టీలో చేరికకు ఆహ్వానం

దర్శి: స్థానికంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు, వెనుకబడినవర్గాల నేత, మాజీ తెలుగుదేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షులు బల్లగిరి శ్రీనివాస్ ను వారి స్వగ్రుహం నందు మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ లోకి రావలసిందిగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత ఆశయాలతో బాటు నియోజకవర్గంలో సుమారు మూడు దశాబ్దాల కాలంగా వేళ్లూనుకున్న స్థానికేతరుల పరిపాలన, నియోజకవర్గ వెనుకబాటుతనం, దళారుల ప్రాబల్యం మొదలగు ఎన్నో అంశాలపై ఇరునేతలు చర్చించారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి, స్థానికుల ఆత్మగౌరవానికి కృషి చేయాల్సిన అవసరంపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ ఐ టీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, ముండ్లమూరు మండల కమిటీ ఉపాధ్యక్షులు అంచుల వీరాంజనేయులు, దర్శి పట్టణ కమిటీ కార్యదర్శి ఉప్పు ఆంజనేయులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు పాల్గొన్నారు.