బ్రహ్మసముద్రం మండలం (బైరసముద్రం, అజ్జయ్యదొడ్డి): జనసేన-టిడిపి ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలంలోని బైరసముద్రం, అజ్జయ్యదొడ్డి గ్రామాల్లో టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటా టిడిపి-జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ బాల్యం రాజేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రచారంలో ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు మరియు జనసేన పార్టీ బ్రహ్మసముద్రం మండల ఉపాధ్యక్షులు & నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, కళ్యాణదుర్గం జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు కార్తీక్, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు రుహుల్ల, చిత్తప్ప, మోహన్, రఘు, సతీష్, జనసేన-టిడిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.