తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో శివ స్వాములకు అల్పాహార వితరణ

  • కులాలను కలిపే ఆలోచనా విధానం ఆచరించిన తాడిపత్రి జనసైనికులు

తాడిపత్రి: తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత కమిటీ మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తాడిపత్రి నుండి శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న 400 మందికి శివ స్వాములకు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత కమిటీ మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం ఇమాంవలి, కె రబ్బానీ జె.ఎస్.పి, అచ్చుకట్ల అల్తాఫ్, షేక్ సాధక్, జాఫర్ సాదిక్, షేక్ష, దేవర అంజి, తదితరులు పాల్గొన్నారు.