మిలాద్ ఉన్ నబి సందర్భంగా అల్పాహార పంపిణీ

కాకినాడ సిటీ: మిలాద్ ఉన్ నబి సందర్భంగా 21వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ మరియు జనసేన నాయకుడు మావులూరి సురేష్ నాయుడు, 21వ డివిజన్ ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు.